బ్రూస్ లీ సినిమా ప్లాప్ కావడంతో ఈ సారి ఎలా అయిన సూపర్ హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం చెర్రీ దృవ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే తొలి సారిగా ఫేస్బుక్ వైవ్ చాట్ ద్వారా ఫ్యాన్స్ ని పలకరించారు చెర్రీ. ఈ సందర్భంగా చిరు 150వ సినిమా, తాను చేస్తున్న ధృవ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వెల్లడించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్ల మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మహేష్, ప్రభాస్ లపై మీ అభిప్రాయం ఏంటి? వారితో మీకు ఎలాంటి సంబంధం ఉంది? అని ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. తామంతా మంచి ఫ్రేండ్స్ అని చరణ్ చెప్పుకొచ్చాడు. ముందుగా మహేష్ గురించి మాట్లాడుతూ.. అతడు అమేజింగ్, హ్యాండ్సమ్ యాక్టర్ అని అన్నారు. ఇక ప్రభాస్ నేను మంచి ఫ్రేండ్స్ అని అని చెప్పారు. వృత్తిపరంగా తమ మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ.. వ్యక్తిగంతంగా తామంతా మంచి ఫ్రేండ్స్ అని చరణ్ అన్నారు.
ఇక చిరు 150వ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ కాదని తెలిపాడు. తన ధృవ సినిమా అక్టోబర్ 7వ తేదిన రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పారు. ధృవ చిత్రం తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా ఉంటుందని చెర్రీ అన్నాడు.
Related