Saturday, April 20, 2024
- Advertisement -

నితిన్ వెనక్కి తగ్గడంతో నరేష్ సేఫ్ అయ్యాడు…!!

- Advertisement -

యూత్ స్టార్ నితిన్, అల్లరి నరేష్ మంచి ప్రతిభ గల టాలీవుడ్ నటులని అందరికి తెలుసు. ఇద్దరు తమ కెరీర్ లో చాలా ఫెయిల్యూర్స్ నే చూశారు. ఇక అల్లరి నరేష్ అయిన చాలా కాలం తన సినిమాలతో జనాలను మెప్పించాడు. కాని నితిన్ మాత్రం వరుసగా చాలా ప్లాపులు ఎదుర్కున్నాడు.గతేడాది నితిన్ “భీష్మ” చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు “చెక్” సినిమాతో మరోసారి హిట్ కొట్టడానికి సిద్ధంగా వున్నాడు.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ తో పాటు థ్రిల్ చేసే ఎలిమెంట్స్ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కు లోటు లేకుండా ఈ ట్రైలర్ ఉంది. యూట్యూబ్ లో ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ ను కొల్లట్టింది ఈ చిత్రం ట్రైలర్.

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. నిజానికి ఫిబ్రవరి 19న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు కానీ.. ఇప్పుడు ఓ వారం వెనక్కి జరిగింది.ఫిబ్రవరి 26న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దాంతో ఇప్పుడు అదే రోజున అల్లరి నరేష్ ‘నాంది’ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ఆ చిత్రం దర్శకనిర్మాతలు ముందుకు వచ్చారు.

అవును ‘నాంది’ చిత్రం ఫిబ్రవరి 19నే విడుదల కాబోతుంది.ఒకవేళ అదే రోజున ‘చెక్’ కూడా విడుదలయ్యి ఉంటే.. ‘నాంది’ కి పెద్ద దెబ్బే పడేది. అసలే నరేష్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. దాంతో చాలా కష్టపడి ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేసాడు.విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న నిర్మించాడు. 

అదిరిపోయిన అల్లరి నరేష్‌‘నాంది’ట్రైల‌ర్‌

అబ్బాయిలు కావాలండోయ్.. ! ఎందుకో తెలుసా?

చెట్లు కూడా నవ్వేస్తాయట !

ఈ స‌ర్పంచ్ ను ఆద‌ర్శంగా తీసుకోవాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -