Monday, May 13, 2024
- Advertisement -

వైజాగ్ లో కూడా నయీం దందాలు .. !

- Advertisement -

దండాలు చెయ్యడం , నేరగాళ్ళ జాబితాలో టాప్ గా నిలిచిన గ్యాంగ్ స్టర్ నయీం గురించి వివిధ విషయాలు తెలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలని ఒకప్పుడు గడ గడ లాడించిన నయీం విశాక లో కూడా పెద్ద నెట్వర్క్ ని పెట్టుకున్నాడు అని అంటున్నారు. వైజాగ్ కి దాదాపు రెండు మూడు నెలలలో చాలా సార్లు ఒచ్చి వెళ్ళాడు అంటున్నారు.

ఏదైనా సెటిల్మెంట్ లు చెయ్యాలి అన్నా దందా సరిగ్గా నడవడం లేదు అన్నా కూడా నయీం వైజాగ్ వరకూ వెళ్ళేవాడు అని అంటున్నారు. నయీం విశాక రావడం పట్ల సరైన ఆధారాల కోసం పోలీసులు సైతం వెతుకుతున్నారు. సిట్ అధికారులు ఆదివారం విశాఖలో ప్రధానంగా రైల్వేస్టేషన్ పై దృష్టి సారించి.. ఆర్ పీఎఫ్ – రైల్వే పోలీసు – ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

విశాఖ నుంచి వెళ్లే గోదావరి – దురంతో ఎక్స్ ప్రెస్ ల రిజర్వేషన్ టికెట్ల వివరాలను – ప్లాట్ ఫారాల సీసీ టీవీ ఫుటేజీలను తీసుకున్నారు. నయీం – అతడి అనుచరుల రాకపోకల జాడలేమైనా తెలుస్తాయేమో అని రైల్వే శాఖ వైపు నుంచి విచారణ జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -