బ్రిటన్లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను భయపెడుతోన్న కరోనా ‘కొత్త రకం’ వైరస్ భారత్లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా తేలింది.
బెంగళూరులోని నింహన్స్లో మూడు, హైదరాబాద్లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్ఐవీలో ఒక కేసు నిర్ధరణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం అధికారంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆరుగురిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్లో ఉంచినట్లు తెలిపింది.
యూకేలో కొత్త రకం వైరస్ ఆందోళనకరంగా మారిన సమయంలో భారత్లో ఈ కేసులు వెలుగుచూడటం కలవరపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్తరకం విజృంభిస్తోంది. అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త రకం వైరస్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు యూకేకు విమానసర్వీసులు నిలిపివేశాయి.