- Advertisement -
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్ కు రప్పించడమంటే అంత సులభం కాదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ వేలాది కోట్ల రూపాయల నల్లధనం విదేశాల్లో మూలుగుతోందని అన్నారు.
ఈ నల్లధనాన్ని భారతదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలు త్వరలో విజయవంత మవుతాయని ఆయన అన్నారు. అయినా నల్లధనాన్ని తిరిగి రప్పించడమంటే విమానాల్లో కట్టలు తరలించినంత సులభం కాదని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ డబ్బును చట్టపరిధిలోనే వెనక్కి తీసుకురావాలని ఆయన చెప్పారు.