నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ.. తన అందం, అభినయంతో మస్తు క్రేజ్ సంపాదించుకున్న నటి నిధి అగర్వాల్. ఇటీవల ఇస్మార్ శంకర్ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. అయితే, ఆమె అభిమానులు ఆమెపై చూపుతున్న ప్రేమకు నిధి అగర్వాల్ తెగ సంబరపడిపోతున్నది. తన అభిమానులను తెగ పొగిడెస్తున్నది ఈ అమ్మడు.
ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవల ఈ అమ్మడి తమిళనాడు ఫ్యాన్స్ ఏకంగా గుడిని కట్టి అందులో నిధి అగర్వాల్ విగ్రహాన్ని ప్రతిష్టించి.. పాలాభిషేకం చేసి.. తమ ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యలో స్పందించిన నిధి అగర్వాల్.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తారని అస్సలు ఊహించలేదని అన్నారు.
ఈ విషయం తెలిసి మొదట షాక్ కు గురైనప్పటికీ.. తర్వాత ఎంతో ఆనందం కలిగిందని తెలిపింది. తనపై చూపుతున్న ప్రేమను జన్మజన్మకు గుర్తుంచుకుంటానని తెలిపింది. తనపై చూపిన స్వచ్ఛమైన ప్రేమ వెలకట్టలేనిదనీ, ధన్యవాదాలు తెలిపింది. తన కోసం నిర్మించిన ఈ గుడిని నిర్వాసితుల కోసం వినియోగించాలని తన అభిమానులను కోరింది నిధి అగర్వాల్. గతంలోనూ పలువురు సినీ తారలకు తమిళ అభిమానులు గుడి కట్టిన సంగతి తెలిసిందే.
దాల్చిన చెక్కతో కలిగే లాభాలు!
ఉదయాన్నే నిమ్మరసం తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
జక్కన్నా.. మజాకా.. విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల మోత !