Sunday, May 19, 2024
- Advertisement -

మనదేశంలో కరోనా ఒక్క కేసు లేని రాష్ట్రం ఏదో తెలుసా ?

- Advertisement -

ప్రపంచం మొత్తం తిరిగేస్తోంది ఈ కరోనా మహమ్మారి. సముద్ర మధ్యలో ఉన్న దేశాల్లోకి కూడా ఈ కరోనా చొచ్చుకెళ్లుతోంది. ప్రపంచంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు లేకుండా.. తమ బతుకులు తాము బతికే దేశాల్లో మాత్రమే కరోనా లేదు. అయితే ఇలాంటివి వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఇక పెద్ద దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పిట్టల్లా ప్రాణాలు రాలిపోతున్నాయి. ఇక ప్రపంచానికి పెద్దన్నలా ఉండే అమెరికా పరిస్థితి మరింత దారుణం అని చెప్పాలి.

ఆ దేశం బాటలోనే ప్రపంచంలోని పలు దేశాలు ఉన్నాయి. ఇక అన్ని దేశాలతో పోలీస్తే 134 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వ్యాప్తి నిజంగా తక్కువగానే ఉందని చెప్పాలి. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నా.. నియంత్రించే స్థాయిలోనే అవన్నీ ఉన్నాయని చెప్పక తప్పదు. మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్.. గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువగా ఉంటూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ కేసులు పేరుగుతున్నా నియంత్రించే స్థాయిలోనే ఉన్నాయి.

ఇలాంటివేళ కరోన పాజిటివ్ కేసు ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాని రాష్ట్రం ఏదైనా ఉందా ? అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి. ఆనీ నిత్యం పర్యాటకులతో కళకళలాడే రాష్ట్రంలో.. కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాని రాష్ట్రం ఉంది. అదే గోవా. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. దాంతో ఇక్కడ తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేసి.. రోజువారీ కార్యకలాపాల్ని పునరుద్దరించారు. మొత్తంగా చూస్తే.. దేశంలో కరోనా లేని స్వర్గం ఏదంటే గోవా అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -