అల్లోపతి, మోడరన్ మెడిసిన్ లపై యోగా గురు రామ్ దేవ్ కాంట్రవర్సిషయల్ కామెంట్లు చేశారు. ప్రాచీన కాలం నుంచి మన ఆయుర్వేద శాస్త్రం యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని… అటువంటి ఆయుర్వేదాన్ని కాదని, అల్లోపతి మెడిసిన్ ను ప్రమోట్ చేస్తున్నారని… దేశంలో క్రిస్టియానిటీని పెంచి పోషించడానికే ఇది జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఇప్పుడు వచ్చిన అల్లోపతి అనేది పనికిమాలిన సైన్స్ తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాందేవ్ పై దేశద్రోహం కేసులు పెట్టాలని వ్యాఖ్యానించింది.
గురువారం తన అరెస్టుపై ఛాలెంజ్ చేస్తూ ఓ వీడియోలో కనిపించారు. వాళ్ల బాబులు కూడా స్వామి రామ్దేవ్ను అరెస్ట్ చేయలేరు అంటూ స్వయంగా చెప్పుకున్నారు. తనను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని ఆయన అన్నారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. వాళ్లు కేవలం శబ్ధం మాత్రమే చేస్తున్నారు. థగ్ రామ్దేవ్ (క్రిమినల్ రామ్దేవ్), మహా థగ్ రామ్దేవ్, రామ్దేవ్ అరెస్ట్ లాంటి ట్రెండ్లు మాత్రమే క్రియేట్ చేయగలరు అని రామ్దేవ్ అన్నారు.
అల్లోపతి వాడిన ప్రజలు లక్షల మంది చనిపోతున్నారు. వాళ్లకు సరైన ట్రీట్మెంట్ లేక లేదంటే ఆక్సిజన్ అందక చనిపోతున్నారు అని రామ్ దేవ్ మాట్లాడారు. అంతేకాకుండా అల్లోపతి అనేది మూర్ఖమైనది, విలువలేనిది అని ఆరోపించారు. కాగా, టాప్ మెడికల్ బాడీ డాక్టర్లు కూడా రామ్దేవ్ పై పరువు నష్టం దావా కింద రూ.1000కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 15రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.
బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకర్ రష్మి