- Advertisement -
కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన శాఖ, ఐటీశాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. బుధవారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యాలయంలో జరిగిన అవగాహన ఒప్పందం కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు.
2022 కల్లా అందరికీ సొంతిళ్లు కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. సామాన్యులు సైతం ఇంటికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులో లోపాలుంటే సరిదిద్దుకునేలా అవగాహన ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు. ప్రభుత్వ సేవలు దారిమళ్లకుండా ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అధికారులను కోరారు.