Thursday, April 25, 2024
- Advertisement -

ప్రాణం తీసిన ఆక్సిజన్ సిలిండర్..!

- Advertisement -

ఛత్తీస్​గఢ్​లోని ఓ ఆసుపత్రిలో ఘోరప్రమాదం జరిగింది. రాజ్​నంద్​గావ్​లోని మెడికల్​ కాలేజీ ఆసుపత్రిలో ఆక్సిజన్​ సిలిండర్​ పేలి.. 65 ఏళ్ల రోగి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడికి వెంటిలేటర్​ సహాయంతో చికిత్స అందిస్తున్న సమయంలో.. ఆక్సిజన్​ ప్రవాహం పెరిగి సిలిండర్​ పేలినట్లు సిబ్బంది తెలిపారు. సిలిండర్​ మార్చాలని వార్డు బాయ్​ ప్రయత్నించినప్పటికీ ఒత్తిడి తీవ్రత పెరిగి అది పేలిపోయినట్లు తెలుస్తోంది.

మృతుడిని మోహన్​ సింగ్​గా గుర్తించారు. కొద్దిరోజులుగా కడుపునొప్పిగా బాధపడుతున్న బాధితుడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం.. ముందు జాగ్రత్తగా అక్కడే చికిత్స పొందుతున్న మరో 9 మంది రోగులను వేరే వార్డుల్లోకి తరలించారు.

మరోవైపు.. బాధితుడు ఆసుపత్రిలో చేరినప్పుడే అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు ఇంఛార్జ్​ సూపరింటెండెంట్​ అజయ్​ కోసా. అతడు సిలిండర్​ పేలుడుతో చనిపోలేదని, అనారోగ్యం కారణంగానే మరణించాడని చెప్పుకొచ్చారు.ఈ ఘటనపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -