పద్మావతి చిత్రం వివాదం రోజు రోజుకి వివాదం ముదురుతోంది. ఇప్పటికే సినిమా వివాదం తారాస్థాయికి చేరింది. తాజాగా ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పద్మావతి సినిమా ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకోంది. చిత్ర విడుదలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నహర్గఢ్ కోటకు వేలాడుతున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం ఉదయం స్వాధీనపరుచుకున్నారు.
ఆ సినిమాకి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ యువకుడ్ని ఎవరైనా చంపేశారా.? నిజంగానే, సినిమాకి వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్నాడా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ లెటర్ దొరికింది. సూసైడ్ నోట్లో పద్మావతి’ సినిమాని అడ్డుకునేందుకు ఎవర్నయినా చంపడానికి వెనుకాడం.. అలాగే అవసరమైతే మా ప్రాణాల్ని తీసుకోవడానికీ వెనుకాడం.. అంటూ ఆ యువకుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘పద్మావతి’ సినిమాకి వ్యతిరేకంగా రాజ్పుత్ కర్ణిసేన గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే.
సినిమాకి వ్యతిరేకంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జైపూర్లోని నహర్గర్ ఫోర్ట్ వద్ద ఓ యువకుడు ఉరితాడుకి వేలాడుతూ కన్పించడంతో.. రాజ్పుత్ కర్ణిసేన మరింతగా చెలరేగిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. సినిమా విడుదల అయితె ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననె ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొంది.