Friday, May 3, 2024
- Advertisement -

పాక్ నయా ఆరోపణలు.. అంతా గప్ చుప్..!

- Advertisement -

తమ దేశంపై భారత్​ మెరుపుదాడులకు ప్రణాళిక రూపొందించిందంటూ పాకిస్థాన్​ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్​ యూసఫ్ ఆరోపించారు. పాక్​ ప్రధాని ఇమ్రాన్​కు మొయీద్​ శుక్రవారం చేసిన ట్వీట్​లో..”షా మహమ్మద్​ ఖురేషీ(పాకిస్థాన్​ విదేశాంగ శాఖ మంత్రి) యూఏఈలో అంతర్జాతీయ మీడియాకు ఈ విషయం చెప్పారు. మనకున్న నిఘా సమాచారం ప్రకారం పాక్​పై భారత్​ మెరుపు దాడులు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది,” అని పేర్కొన్నారు.

ఈ ఆరోపణల్ని భారత జాతీయ భద్రత సలహా బోర్డు ఛైర్​ పర్సన్ పీఎస్ రాఘవన్​ తోసిపుచ్చారు. ఆయన ‘మీడియా’తో మాట్లాడుతూ.. భారత్​కు వ్యతిరేకంగా కుటిల చర్యలకు పాల్పడటానికి పాకిస్థాన్​ కుట్రలు పన్నుతోందన్నారు.

భారత సైన్యంపై కూడా పాకిస్థాన్​ ఆర్మీ అసత్య ప్రకటనలు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి చిరికోట్​ సెక్టార్​లో భారత్​ సైన్యం ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పులకు దిగిందని, ఐక్యరాజ్యసమితి మిలిటరీ పరిశీలకుల వాహనాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుందని పాక్ ఆర్మీ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఢిల్లీ లోని భారత సైనిక వర్గాలు తిప్పికొట్టాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -