పాక్ ఉగ్రమూకలు భారత్,ఆప్ఘనస్తాన్లలో ఏక్షణమైనా ఉగ్రదాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అమెరికా ఇంటెలిజెన్సీ భారత్ను హెచ్చరించింది. రెండు దేశాల్లోకి ప్రవేశించేందుకు సరిహద్దుల్లో అదునుకోసం ఎదురు చూస్తున్నారని తెలపింది.
అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ డానియెల్ కోట్స్ సెనేట్ సెలక్ట్ కమిటీ సభ్యులతో నిఘాకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ‘తమ దేశంలోని ఉగ్రవాదులను నిలువరించడంలో పాక్ విఫలమైంది. ఈ ఉగ్ర గ్రూపులు అమెరికాకు కూడా ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడెప్పుడు దాడులు చేద్దామా అని ఎదురుచూస్తున్నాయి. భారత్, అప్ఘనిస్థాన్పై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారు’ అని ఆయన చెప్పారు.
భారత్-పాక్ సంబంధాల విషయంలో పాక్ మొదటినుంచి నిర్లక్ష్యం వహిస్తోందనీ తెలిపారు. ఇంకోసారి ఇరు దేశాల సరిహద్దు వద్ద పాక్ ఉగ్రవాదుల కారణంగా ఎలాంటి పెద్ద దాడి జరిగినా కచ్చితంగా ఆ దేశంతో తమకు ఉండే సంబంధాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. తమ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయాల్సిన అవసరం ఉందని పాక్కు హెచ్చరించారు.
Related