Thursday, May 16, 2024
- Advertisement -

హ…..హా…. ఆంధ్రా పప్పు…. ఇండియా పప్పు…. మరోసారి గూగుల్‌లో ట్రెండింగ్

- Advertisement -

నో డౌట్…..ఇద్దరూ ఇద్దరే. మాటలు తడబడడంలో ఎవ్వరూ ఎవ్వరికీ తీసిపోరు. ఇక మాటలను కోటలు దాటించడంలో కూడా ఒకరిని మించిన వారు ఒకరు. రాజకీయాల్లో కామెడీని పండిస్తూ పదుగురినీ నవ్వించడంలో ఇండియాలో అక్కడ ఆ పప్పు…..ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ మన పప్పు నాయకుడు మరోసారి ట్రెండ్ క్రియేట్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని ఇండియన్ పప్పు నాయకుడు శతథా ప్రయత్నించాడు. కాబోయే ప్రధానిని నేనే అని కూడా ప్రకటించేసుకున్నాడు. అయితే కర్ణాటక ప్రజలు మాత్రం ఈ పప్పు నాయకుడిని కామెడీగా తీసుకున్నారు. కాకపోతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం పప్పు అంటేనే గూగుల్ మొత్తం కూడా మరోసారి ఈ పప్పు నాయకుడి పేరు, ఫొటోలు కనిపిస్తున్న పరిస్థితి.

ఇక ఆంధ్రప్రదేశ్ పప్పు నాయకుడు కూడా తక్కువేమీ కాదు. మోడీని ఎలా అయినా ఓడించాలని చాలా మంత్రాంగమే చేశారు. అధికారంలో ఆంధ్రప్రదేశ్ నాట అక్రమంగా సంపాదించిన వెయ్యి కోట్ల రూపాయలను కాంగ్రెస్ పప్పు నాయకుడి తరపున ఓటర్లకు పంచడానికి పంపారట. ఇక ఆరడుగుల బుల్లెట్‌తో పాటు క్రిటిక్ కత్తులను కూడా సొంత ఖర్చులతో కర్ణాటక పంపించి నానా యాగీ చేయించాడు. కానీ తెలుగు వారు ఉన్న చోటల్లో భాజపాకు గతంలో ఎప్పుడూ రానన్ని ఎక్కువ సీట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్ పప్పు నాయకుడికి దిమ్మతిరిగే బొమ్మ కనపడింది. ప్రత్యేక హోదా రాలేదన్న కోపం మొత్తం పెదబాబుపైనే చూపించే ప్రమాదం ఉందా అని ఇప్పుడు పచ్చ బ్యాచ్‌లో భయం మొదలైంది.

మొత్తంగా చూస్తే తెర ముందు భారతదేశంలోనే సీనియర్ పార్టీకి చెందిన పప్పు నాయకుడు……తెరవెనుక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తండ్రికి తగ్గ తనయుడిని అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ పప్పు నాయకుడు మోడీని ఓడించడానికి నానా పాట్లూ పడ్డారు……..చివరికి మోడీ కొట్టిన దెబ్బకు ఇప్పుడు కామెడీగా గూగుల్‌లో ట్రెండ్ అవుతున్నారు. నెటిజనుల నుంచి సెటైర్స్ ఆ రేంజ్‌లో పడుతున్నాయి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -