Tuesday, May 14, 2024
- Advertisement -

చంద్రబాబు మీద సీరియస్ గా ఉన్న పవన్ ఫాన్స్

- Advertisement -

శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్దం అవుతున్న వేళ, పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మీద గుర్రుగా ఉన్నారు. ఎలెక్షన్ కి ముందర పవన్ కళ్యాణ్ మాత్రమె తమకి దిక్కు అంటూ ఇంటికి వెళ్లి మరీ ప్రచార కార్యక్రమం లో పాల్గొనమని కోరారు చంద్రబాబు. ఇచ్చిన మాట ని నిజం చేస్తూ అన్ని చోట్లా బీజేపీ టీడీపీ కూటమి కి అద్వితీయమైన మెజారిటీ వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసారు. తీరిక లేకుండా ఎలెక్షన్ కి ఐదు రోజుల ముందు నుంచీ హెలీ కాప్టర్ సాయం తో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి బాబు ని పొగుడుతూ ప్రచారం సాగించారు పవన్.

చంద్రబాబు మీదా, మోడీ మీదా అంత గౌరవం తో ఉన్న పవన్ కళ్యాణ్ కి వారు తిరిగి ఇచ్చింది ఏమీ లేదు, ఆయనా కోరుకుంది కూడా లేదు కేవలం ప్రజలకి మంచి చేయమని తనకేమీ ఒద్దు అని తన సినిమాల పనిలో బిజీ అయిపోయాడు పవన్ కళ్యాణ్. 

అంత చేసిన పవన్ ని కనీసం బాబు లేక్కచేయట్లేదు అనేది పవన్  ఫాన్స్ ఆవేదన . పనుల ఒత్తడి కారణంగా పవన్ ను ఆహ్వానించటానికి వెళ్లని బాబు.. తన తరఫు ప్రతినిధులుగా మంత్రులు కామినేని శ్రీనివాస్.. అయ్యన్న పాత్రుడులను పంపుతున్నారు. ఇది పవన్ ఫాన్స్ కి నచ్చలేదు, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా లేనపుడు ఒకలాగా ప్రవర్తించడం బాబు కి మాత్రమే సాధ్యం అంటున్నారు వారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -