పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో రేపు తిరుపతి లో భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసారు. ఇటివలే కర్ణాటకలోని కోలార్ లో పవన్ అభిమానికి ఎన్టీఆర్ అభిమానికి జరిగిన గొడవలో పవన్ అభిమాని వినోద్ రాయల్ చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న తిరుపతి కి వచ్చారు పవన్. ఆ తర్వాత తిరుమల వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నారు.
వెంకన్న దర్శనం తర్వాత కొండపైనే అతిథి గృహంలో బస చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అయితే రేపు అభిమానులతో కలిసి తిరుపతిలో భారీ సభ నిర్వహించేందుకు పవన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తిరుమలకు వెళ్లెందుకు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే పవన్ తిరుపతి లోనే ఉన్నాడని తెలుసుకున్న చుట్టపక్కల వారే కాక వైజాగ్, శ్రీకాకుళం , గోదావరి జిల్లాలనుండి కూడా అభిమానులు భారీగా సొంత కార్లలో తిరుపతి కి చేరుకుంటున్నారు. మరి రేపు జరిగే సభలో పవన్ సినిమాల గురించి మాట్లాడతారా? లేక రాజకీయాల గురించి మాట్లాడతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Related