జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టిడిపి ఎంపీల మధ్య మాటల యుద్దం బాగా ముదురుతోంది. ప్రెస్మీట్లో పవన్ మాట్లాడిన తీరును నిరసిస్తూ టిడిపి ఎంపీలు పవన్పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.
దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో స్పందించారు. అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. అవసరమైతే జైలుకు కూడా వెళ్ళేందుకు సిద్దంగా ఉన్నానని ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు తప్పని తేలితే జైలుకు వెళ్ళడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇక ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు టిడిపి ఎంపీలపై విరుచుకు పడ్డారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ వల్లనే టిడిపి అధికారంలోకి వచ్చిందన్నారు. దమ్ముంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని టిడిపి ఎంపీలకు సవాల్ విసిరుతూ బుధవారం విజయవాడలోని మార్కెట్ సెంటర్లో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.
మిమ్మల్ని గెలిపించిన నేతకు ప్రశ్నించే హక్కు ఉందంటూ ప్లకార్డులతో ప్రదర్శనకు దిగారు..