- Advertisement -
ప్రధాని మోడీ భార్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రాజస్థాన్లోని కోట-చిత్తార్ హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. జశోధ బెన్ తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను చిత్తార్గర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని… వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
యశోధ షాక్లో ఉన్నారని… ఆమె కోలుకోగానే డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా… పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. జశోద రాజస్థాన్లోని ఓ పెళ్లికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.