మతాల మధ్య చిచ్చుపెట్టేలా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారంటూ పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎక్తా యాత్రలో భాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మతల మధ్య చిచ్చు పెట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో హిందువులు..ముస్లింలు సోదర భావంతో ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మతం పేరిట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని వేములవాడ ముస్లిం కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశంలోని మసీదులు ధ్వంసం చేస్తామని చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. రాజ్యాంగం ప్రకారం ఏ మతం వారికైన దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కు ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉంటున్న వారి మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.
పునర్ ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్ర