వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో జనంలో వెళుతున్నారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్న షర్మిల మలి విడత ప్రజా ప్రస్థానం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అధ్యయనం కోసం మే 11న ఈ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మే 28 నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునర్ ప్రారంభించాలని నిర్ణయించారు. సత్తుపల్లి నుంచే ఈ పాద్రయాత్ర మరోసారి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో లెక్కలు చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డిని షర్మిల డిమాండ్ చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవగాహనారాహిత్యంతో కులాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మలి విడత పాదయాత్రలో ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
హైదరాబాద్కు ప్రధాని..బెంగళూరుకు సీఎం