- Advertisement -
ఫిల్మ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ ఐటి శాఖా మంత్రి కేటిఆర్ ను సెక్రెటరేట్లోని ఆయన ఛాంబర్లో కలిసి తన కోర్కెను వెల్లడించాడు. నాకు మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లెను దత్తత తీసుకోవాలని ఉందని కోరడంతో మంత్రి ఇచ్చిన సలహా మేరకు ప్రకాష్ రాజ్ ఫాలో అయిపోయాడు. దీనిపైన కేటిఆర్ ప్రకాష్ రాజ్ ను కేటిఆర్ అభినందించారు. దీనిపై స్పందిస్తూ కలెక్టర్ శ్రీమతి శ్రీదేవి మరియు లోకల్ ఎమ్మెల్యే శ్రీ అంజయ్యను పరిచయం చేశాడు. శ్రీమంతుడు సినిమా తర్వాత ఫిల్మ్ యాక్టర్స్ ఈ విదంగా స్పందించడం చాలా సంతోషించదగిన విషయమని పలువురు పేరొన్నారు. శ్రీమంతుడు సినిమా హీరో మహేశ్ బాబు మరియు హీరో మంచు విష్ణు చిత్తూరు జిల్లాలో పది గ్రామాలను దత్తత తీసుకోవడం హర్షించదగిన విషయం.