Monday, May 6, 2024
- Advertisement -

ప్రణబ్ కుమారుడు, కుమార్తెలు కుడా వ్యతిరేకం..!

- Advertisement -

మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’పై ఆయన కుమారుడు, కుమార్తెల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ పుస్తకాన్ని వెంటనే ఆపేయాలని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రచురణకర్తలను కోరగా.. అనవసర ఆటంకాలు సృష్టించవద్దంటూ ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తన సోదరుడికి సూచించారు. టిట్టర్ వేదికగా ఇద్దరూ ఈ పుస్తక ప్రచురణ అంశంపై విభేదించారు.

వచ్చే జనవరిలో రూపా పబ్లిషర్స్ ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్న ఈ పుస్తకంలోని పలు అంశాలు ఇటీవల వార్తలకెక్కాయి. ఇందులో కాంగ్రెస్​పై ప్రణబ్ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచాయి. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృష్టిని కోల్పోయినట్లు ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ వైఖరిపైనా ప్రణబ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రణబ్ కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్- తాను సమ్మతిని తెలిపేంతవరకు ఈ పుస్తకాన్ని ప్రచురించవద్దని ప్రచురణకర్తలను కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. తక్షణం ప్రచురణను నిలిపివేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. “ఇందులోని కొన్ని ప్రేరేపిత అంశాలు వార్తలకెక్కాయి. నా తండ్రి దివంగతులైన నేపథ్యంలో ఆయన కుమారుడిగా పుస్తకం తుది ప్రతి(ఫైనల్ కాపీ)లోని అంశాలను ప్రచురణకు ముందే నేను పరిశీలించాలని అనుకుంటున్నాను. నా తండ్రి జీవించి ఉంటే ఆయన కూడా అదేపని చేసేవారు.” అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -