ఆ మద్య కేరళలో ఓ ఏనుగు నోట్లో బాంబు పెట్టి దాని మరణానికి కారణం అయ్యారు కొంత మంది దుర్మార్గులు. పద్నాలుగు రోజుల పాటు నీటిలోనే ఉండి ఆ ఏనుగు చనిపోయింది. ఆ తర్వాత కూడ కొన్ని మూగ జీవాలపై కొంత మంది దుర్మార్గంగా ప్రవర్తించారు. తాజాగా గర్భంతో ఉన్న పులిని వేటగాళ్లు సజీవ దహనం చేశారు. ఈ దారుణమైన సంఘటన గత సోమవారం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని పంధర్కావాడ తాలూకాలోని జారీ-జామ్నీ గ్రామాల సమీపంలో చోటుచేసుకుంది.
వేగిన్ అనే ఈ పులి ముందు పంజాలను వేటగాళ్ళు కత్తిరించుకుపోయారు. గర్భిణీ పులిని కల్వర్టు లోపల లాక్ చేసి వేటగాళ్ళు సజీవ దహనం చేశారు. పులి గర్భంలో నాలుగు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం. నాలుగేళ్ల యవసున్నపులి సోమవారం ఉదయం కల్వర్టులో చనిపోయి ఉండటాన్ని ఓ అటవీ నివాసి గమనించాడు. దీంతో అధికారులకు సమాచారం అందివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పులిని బంధించేందుకు ఇనుప చువ్వలను అమర్చడం ద్వారా కల్వర్టులోంచి పులి తప్పించుకోకుండా చూశారు. అది చనిపోయిందా లేదా అని తెలుసుకునేందుకు పదునైన ఆయుధాలతో పొడిచి చూశారు. చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత దాని పంజాలను తొలగించి తీసుకెళ్లారు. తాపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం (టీడబ్ల్యుఎస్)లో ఈ హత్య ఘటన చోటుచేసుకుంది.
కూతురిని ప్రేమించాడని యువకుడి దారుణ హత్య