మన సౌత్ ఇండియాలో హీరోయిన్ సమంత అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.సమంతకుస్టార్ హీరోయిన్గా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సమంత ప్రస్తుతం శాకుంతలం, కాథువాకుల రెండు కాదల్ అనే సినిమాలతో బిజీగా ఉంది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ రెండో సీజన్తో సమంత బాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఇక ఈ సీజన్లో సమంత నెగిటివ్ రోల్ ప్లే చేస్తుండటం ఆసక్తికరం.ఈ వెబ్ సిరీస్ మే లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా రిలీజ్ కాబోతోంది.ఈ వెబ్ సిరీస్ తో సమంత బాలీవుడ్లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
ఇకపోతే కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది.అటు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.గతంలో కంటేసెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని,తప్పనిసరిగా మాస్కు ధరించాలని హీరోయిన్ సమంత ప్రజలనుద్దేశించి చెప్పుకొచ్చింది.
కరోనా మహమ్మారినీ ఎదుర్కొనడానికి సమంత కొన్ని సలహాలను సూచించింది “మనిషికీ హోప్, పాజిటివిటీ ” ఈ రెండు ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొని నిలబడగలమని సూచించింది. మరియు తన ఫ్యామిలే కాకుండా అభిమానులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా కరోనా నియమాలను పాటిస్తే కరోనా మహమ్మారి ఎదుర్కోగల మని తన అభిమానులకు చెప్పుకొచ్చింది.
మహేష్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!
బుల్లితెర హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?