Sunday, May 19, 2024
- Advertisement -

క‌న్న కొడుకుని హ‌త‌మార్చిన త‌ల్లి! మదనపల్లి హత్యల తరహాలో మరో షాకింగ్ ఘటన..

- Advertisement -

మదనపల్లి జంట హత్యల కేసు పూర్తిగా అయిపోనేలేదు. ఆ ఘ‌ట‌న మిగిల్చిన గాయం ఎన్న‌టికీ మానిపోదు. అలాంటి ఘ‌ట‌ను మ‌ళ్లీ జ‌రిగొద్దు అని అనుకోవ‌డం త‌ప్పించి ఇంకోటి చేయ‌లేము. కానీ ఆ గాయం మాన‌క‌ముందే అచ్చం అలాగే మ‌రో షాకింగ్ ఘ‌ట‌న కేరళలోని పాలక్కడ్‌లో జరిగింది. ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

కేర‌ళ‌లోని పాలక్కడ్ కంట్రోల్ రూంకు వేకువజామున 3 గంటల స‌మ‌యంలో 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఒక‌ కాల్ వచ్చింది. ఆ కాల్ లో ఒక మహిళ మాట్లాడుతూ..త‌న ఆరేళ్ల కొడుకును చంపేశానని తెలిపింది. అల్లా కోసం ఈ త్యాగం చేశానని చెప్పింది. దీంతో పోలీసులు ఒక్క‌సారిగా షాక్ గుర‌య్యారు. ఆ మహిళ అడ్రస్ చెప్పడంతో వెంటనే అక్క‌డ‌కు చేరుకున్నారు.

స‌ద‌రు మ‌హిళ కుటుంబ వివ‌రాల్లోకి వెళ్తే.. పాలక్కడ్ జిల్లాకు చెందిన షాహిదా మదరసా టీచర్‌గా పనిచేసేది. ఆమెకు 6 ఏళ్ల‌ వయసున్న ఆమిల్ అనే కూమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె గర్భంతో ఉంది. గర్భిణి అయిన షాహిదా.. నా బిడ్డను అల్లాకు అర్పిస్తున్నాను అని చెప్పి.. భర్త, మిగిలిన పిల్లలు బెడ్‌రూంలో నిద్రిస్తున్న‌ప్పుడు ఆమిల్‌ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి గొంతు కోసేసింది. ఆ తర్వాత జ‌రిగిన విష‌యాల‌న్ని పోలీసుల‌కు కాల్ చేసి చెప్పింది. దీనిపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

ఈ ప‌దాల‌ను గూగుల్ లో వెతికితే ఇక‌నుంచి జైలుకే..!

అప్సర రాణిపై సంచ‌ల‌న కంమెట్లు చేసిన‌ ఆర్జీవీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -