ఇటలీలో కొవిడ్-19 మృతుల బంధువులు ఆ దేశ ప్రధానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 500 మంది కలిసి ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వంపై దావా వేశారు. తమకు జరిగిన నష్టానికి రూ.900 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారు తమ దావాలో ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటే, ఆరోగ్యశాఖ మంత్రి రోబర్టో స్పెరాంజా, లాంబార్డీ ప్రాంత గవర్నర్ అట్టిలియో ఫొంటానా పేర్లను చేర్చారు.
మొదటిసారి కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరవాత దాని కారణంగా అత్యధికంగా ప్రభావితమైన పాశ్చాత్య దేశాల్లో ఇటలీ ముందుంది. ఫిబ్రవరిలో ఆ దేశంలో వైరస్ ఉనికిని గుర్తించగా.. ఇప్పటివరకు 70 వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఐరోపా పరంగా చూసుకుంటే మృతుల విషయంలో తొలిస్థానంలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచింది. ఆ దేశం వైరస్తో ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యిందో ఈ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.