Monday, May 6, 2024
- Advertisement -

వైఎస్ వివేకా మృతిపై అనుమానాలు…లోతైన ద‌ర్యాప్తు చేయాల‌న్న వైసీపీ

- Advertisement -

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున పులివెందులలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. బాత్‌రూమ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా పడి ఉండటం, ఆయన తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో మృతి వెనుక అనుమానాలు ఉండ‌టంతో ఆయ‌న పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఆయన విగతజీవిగా ఉన్న ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించడంతో, ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. బాత్ రూములో ఆయన కాలుజారి పడివుండవచ్చని, ఆ సమయంలో తలకు దెబ్బ తగిలివుండవచ్చని భావిస్తున్నా, పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్ 175 కింద కేసు నమోదు చేశారు.

గురువారం ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్‌రూంలో రక్తపు మడుగులో పడిఉండటాన్ని పనివారు గుర్తించి కుటుంభ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. తాజాగా ఆయన మరణం వెనుక అనుమానాలు రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -