ఇద్దరి మనసులు కలిస్తే వయస్సుతో నిమిత్తం లేకుండా పెళ్లిల్లు చేసు చేసుకొవడం లేకపోతే సహజీవనం చేయడం ఇప్పుడు సాధారనం అయ్యింది. అలాంటి సంఘటనే పంజాబ్లో జరిగింది.అయితే ఆజంట ఇప్పుడు కోర్టుకెక్కారు. ఆతని వయస్సు 67, ఆమె వయస్సు24 ఇద్దరు కలసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాని వారి పెద్దలు ఒప్పు కోక పోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమకు ప్రాణ హాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు జంట.
వివరాల్లోకి వెల్తే…బలైన్ గ్రామానికి చెందిన షంషేర్సింగ్కు 67 ఏళ్లు. చండీఘడ్కు చెందిన నవ్ప్రీత్ కౌర్ అనే 24 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలసి జీవించాలనుకున్నారు. ఛండీగఢ్లోని ఓ గురుద్వారాలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు వివిధ వర్గాల నుంచి వీరికి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలోనే షంషేర్, నవ్ప్రీత్లు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ జంటకు రక్షణ కల్పించాలని సంగ్నర్, బర్నాల జిల్లాల ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.