ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లో పర్యటించనున్నారు. కచ్లోని దోర్దోను సందర్శించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్కు, ఆటోమేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్, లవణ నిర్మూలణ ప్లాంట్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిపింది. రాన్ ఆఫ్ కచ్ను సైతం మోదీ సందర్శిస్తారని పేర్కొంది. అనంతరం సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొంటారని వివరించింది.
రోజుకు పది కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసేలా కచ్లోని మాండవీలో డెస్టినేషన్ వాటర్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దాదాపు 8 లక్షల మందికి ఈ నీరు సరఫరా అవుతుందని పేర్కొంది. గుజరాత్లో నిర్మించే ఐదు డెస్టినేషన్ ప్లాంటులలో ఇది ఒకటని వెల్లడించింది.