Wednesday, May 15, 2024
- Advertisement -

మోడికి మాడు పగులుతూనే ఉంది

- Advertisement -

శివసేన-బీజేపీ‌కి మధ్య వచ్చిన గ్యాప్ అంతకంతకు పెరిగేలా కనిపిస్తుంది. అది ఎంత వరకు వెళ్లిందంటే శివ‌సేన పార్టీ… రాహుల్‌ని తెగ పొగిడేసే వరకు వెళ్ళింది. ఈ సందర్భంగా 2014 ఎన్నిక‌ల‌తో పోల్చి చూస్తే రాహుల్‌ లో ఈ మధ్య చాలా చేంజెస్ వ‌చ్చాయ‌ని, యావత్ దేశ‌మే ఇప్పుడు రాహుల్ ని ఒక ఆలోచ‌నాప‌రుడైన నేత‌గా గుర్తిస్తోంద‌ని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.

మోదీ సైతం ఇక నుంచి రాహుల్ మ్యాటర్లో కాస్త జాగ్రత్తగా ఉండాల‌ని సంజ‌య్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ లో భాగం కావడంకోసం మాత్రమే బీజేపీని తాము భరిస్తున్నామని, రాహుల్ నుంచి మోదీకి త్వర‌లో చాలా కష్టాలు రానున్నాయని చెప్పారు.

వన్సపాన్ ఎ టైమ్ రాహుల్ ఏ విష‌యాన్ని చెప్పినా… స‌రిగా వినేవాడు కాద‌ని, ఇప్పుడు ప్రతివిష‌యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ అంశాల్ని ఆక‌ళింపు చేసుకుంటున్నార‌ని శివ‌సేన ఎంపీ చెబుతున్నారు. ఆ వినే ఓపిక మోదీలో కొరవడిందని ఆయన దుయ్య బట్టారు. సంజజ్ రౌత్ చెప్పడమే కాదు.. ఎంటైర్ మీడియా కూడా ఈవిషయంలో మోడీని బ్లేమ్ చేస్తూ వార్తలు రాయడం,ప్రసారం చేయడం కాషాయ పార్టీకి అర్ధం కాకుండా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -