Tuesday, May 7, 2024
- Advertisement -

బీజేపీ రాహుల్ కు సమాధానం చెప్పేది ఇలాగేనా..?!

- Advertisement -

సెలవులను పూర్తి చేసుకొని వచ్చిన అనంతరం కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ రెచ్చిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ తీరును తెగ విమర్శించేస్తున్నాడు.

ప్రభుత్వ లోపాలను వెదికి ఆ అంశాలను లోక్ సభలో ప్రస్తావిస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ. తాజాగా రాహుల్ గాంధీ రైలులోని జనరల్ బోగీలో ప్రయాణించి కుగ్రామాలకు వెళ్లి రైతులను పరామర్శించాడు. ఈ అనుభవాలను లోక్ సభలో ప్రస్తావించాడు.

ఈ సందర్భంగా రాహుల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొన్నాడు. ప్రధాని విదేశీ పర్యటనలను కూడా ప్రస్తావిస్తూ… విదేశాలకు కాదు మోడీ జీ, పంజాబ్ కు వెళ్లిరైతులను పరామర్శించండి.. అంటూ రాహుల్ ఘాటైన వ్యాఖ్యానాలు చేశాడు. దీంతో భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. రాహుల్ అటు తిరిగి , ఇటు తిరిగి మోడీ మీదకు వచ్చే సరికి కమలం పార్టీ ఎంపీలు ఎదురుదాడి మొదలు పెట్టారు. ఈ ఎదురుదాడిలో బీజేపీ ఎంపీలు వ్యవహరించిన తీరు మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది.

ఇంతకీ బీజేపీ నేతలు ఏమన్నారంటే.. “ఇప్పుడు మోడీని రైతుల వద్దకు వెళ్లాలని రాహుల్ సూచిస్తున్నాడు.. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజుల్లో రాహుల్ ఎప్పుడైనా  రైతులను పరామర్శించాడా? ఆ రోజుల్లో ఆ పని ఆయన ఎందుకు చేయలేదు?” అంటూ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ యువరాజుపై ఎదురుదాడి చేశారు. మరి ఇలా దాడి అయితే బాగానే ఉంది కానీ.. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు రైతుల వద్దకు వెళ్లలేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము వెళ్లము..అన్నట్టుగా మాట్లాడటం మాత్రం అంత అభినందించదగ్గ విషయం అయితే కాదు. బీజేపీకి ప్రతిపక్షానికి సమాధానం చెప్పడానికి అయినా ఇలా మాట్లాడటం బాగోలేదు! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -