- Advertisement -
మొన్నటి వరకు ఎండలకు మాడిపోతున్నవారికి శుభవార్త.. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ రోజు తూర్పు గాలులలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఉత్తర కేరళ నుండి ఇంటీరియర్ కర్ణాటక మరియు మరత్వాడాల మీదగా నైరుతి మధ్య ప్రదేశ్ వరకు ఏర్పడింది. ఈ భావంతో వాతావరణం చల్లబడింది.. పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మండే వేసవిలో ఇలా వర్షం పడటం కాస్త ఉపశమనం అంటున్నారు.