- గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
- ఫ్యూచర్ ఆఫ్ సినిమాపై ప్రసంగం
తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికీ దక్కని అవకాశం మెగా హీరో రామ్చరణ్తేజ్కు దక్కింది. వరుస సినిమాలు తీస్తూ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్న చెర్రీ వ్యాపార రంగంలో కూడా బిజీగా ఉన్నారు. ఆయనకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. దగ్గరుండి మరీ చూసుకుంటుంటారు. అలాంటి వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికీ దక్కని అవకాశం రామ్చరణ్కు దక్కింది. భాగ్యనగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు రామ్చరణ్కు కూడా ఆహ్వానం వచ్చింది.
సదస్సులో పాల్గొని ప్రసంగించాల్సిన వారిలో జాబితాలో అతడి పేరు ఉంది. ఈ ముచ్చట విన్న అభిమానులు ఆనందంలో మునిగారు. ఎంతోమంది ప్రముఖులు పాల్గొనే సదస్సుకు ఆయన హాజరవుతున్నాడు. ఈనెల 28వ తేదీన సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్ పాల్గొంటారు. ఆ సదస్సులో చెర్రీ కూడా ప్రసంగించనున్నారు. ఫ్యూచర్ ఆఫ్ సినిమా అంశంపై రామ్చరణ్ తేజతో పాటు అదితీరావ్హైదరీ, నెక్ట్స్ స్టేజ్ ప్రొడక్షన్స్ సంస్థ సీఈఓ ఒనెకాచి స్టిఫానీ లినస్ ఇడాహొసాలు మాట్లాడనున్నారు. అయితే సదస్సులో ఏ రోజు మాట్లాడాలో ఇంకా వెల్లడి కాలేదు.