Saturday, May 18, 2024
- Advertisement -

త్వ‌ర‌లో కొత్త ప‌దిరూపాయ‌ల నోటు రాబోతోంది…ఏ క‌ల‌ర్‌లో ఉంటుందో తెలుసా..?

- Advertisement -

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త రూ.10 నోట్లు జారీ చేయబోతోంది. చాకోలెట్‌ బ్రౌన్‌ రంగులో మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిసింది. ఈ కొత్త నోటుపై కొణార్క్‌ సన్‌ టెంపుల్‌ పిక్చర్‌ ఉండబోతుందట. సెంట్రల్‌ బ్యాంకు ఇప్పటికే ఈ కొత్త నోట్లను 1 బిలియన్‌ పీసులను ప్రింట్‌ చేసినట్టు ఈ విషయం తెలిసిన అధికారులు చెప్పారు.

కొత్త రూ.10 నోటుకు సంబంధించి డిజైన్‌ను కూడా ప్రభుత్వం గత వారంలోనే ఆమోదించిందని తెలిపారు. ప్రస్తుతం మారుస్తున్న పాత రూ.10 నోటు డిజైన్‌ను 2015లో రూపొందించారు. గతేడాది ఆగస్టులో మహాత్మాగాంధీ సిరీస్‌లో ఆర్‌బీఐ కొత్త రూ.200, రూ.50 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

2015లోనే ఈ నోటు డిజైన్ ను రూపొందించింది. గత వారంలో ఈ డిజైన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నకిలీ నోట్లను అరికట్టే క్రమంలో, తక్కువ డినామినేషన్ నోట్లను ప్రవేశపెడుతోంది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం… ఆ తర్వాత చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి కొత్త నోట్లను ప్రవేశపెడుతూ వస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -