Friday, May 10, 2024
- Advertisement -

చిరంజీవి అనూహ్య నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ఇండస్ట్రీ ని ఏలుతున్న ధ్రువ తార. తాను అనుకున్న విధం గా సెటిల్ అవడమే కాకుండా ఎంతో మంది కెరీర్లు ని కూడా సెటిల్ చేసిన ఘనత అతనికే చెందుతుంది. ఇంత వయసు, ఇంత అనుభవం ఉండి కూడా ఇంకా అభిమానుల కోసం రాత్రి పగలు కష్ట పడుతూ తనకి అయినంత లో ఎంతో కొంత పక్కన వాళ్లకి సాయం చేస్తూ, తన కుటుంబ సభ్యులతో చేయిస్తూ ముందుకు వెళ్తున్న ఈ నట శిఖరం ప్రస్తుతం విద్యా రంగం లోకి అడుగు పెడుతుంది.

చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట ఒక అత్యాధునిక విద్యా సంస్థ ని నెలకొల్పి విద్య ని అందించే ప్రయత్నం చేస్తుంది. అంత సడన్ గా చిరంజీవి ఈ కొత్త బిజినెస్ లోకి ఎందుకు వస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే దీని వెనుక ఒక నోబుల్ కారణం దాగి ఉంది. చిరంజీవి తన అభిమానులకి ఎప్పటికప్పుడు సాయం చేస్తూ వస్తున్నారు. అయితే చాలా మంది అభిమానులు తమ పిల్లలని చదివించుకోవడం లో కష్టాలు పడుతూ ఫీజు సమకూర్చే క్రమం లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెల్సుకున్న చిరంజీవి ఈ స్కూల్స్ ని తెలుగు రాష్ట్రాలు అంతటా నెలకొల్పి తన అభిమానుల పిల్లలకి స్పెషల్ రాయితీ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారట. విద్య అన్నిటి కన్నా ఇంపార్టెంట్ అని నమ్మే చిరంజీవి, అందరికీ విద్య అందాలనే ధ్యేయం తో ఈ పని చేస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -