Monday, April 29, 2024
- Advertisement -

చర్చిలు, దేవాలయాలపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

రేణు దేశాయ్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి తెరకెక్కించిన బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన రేణు దేశాయ్ ఇందులో హీరోగా నటించిన పవన్ కళ్యాన్ ని రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం తర్వాత వీరి మద్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఆ పిల్లలు రేణు దేశాయ్ వద్దే పెరుగుతున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా మరోసారి రేణు దేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తున్నాయి. మన దేశంలో మసీదులు, చర్చిలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటాయి. దేవాలయాలు మాత్రం ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. 

భారత దేశం లౌకిక దేశం అంటారు కదా.. మరి ఇలా అయితే భారత్ లౌకిక దేశం ఎలా అవుతుంది? మసీదులు, చర్చిలను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని నేను చెప్పడం లేదు. కానీ దేవాలయాలను కూడా ప్రభుత్వ అధీనం నుంచి తప్పించవచ్చు కదా’ అని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -