Friday, May 17, 2024
- Advertisement -

రిపబ్లిక్ టీవీ ఛానల్ కి సుప్రీం కోర్టు కి పోరు నేడు..!

- Advertisement -

బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్​ చేస్తూ రిపబ్లిక్​ టీవీ ఎడిటర్​ ఇన్​ చీఫ్​ అర్ణబ్​ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్​ను నేడు పరిశీలించనుంది సుప్రీం కోర్టు. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్య కేసులో పోలీసులు అర్ణబ్​ను అరెస్టు​ చేశారు. దీనిపై అర్ణబ్​ దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించగా.. ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అర్ణబ్​​‌​ తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ముంబయి పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. ఇలా ఉంటే బాంబే హైకోర్టు సూచన మేరకు కింది న్యాయస్థానం అయిన రాయ్‌గఢ్​ సెషన్స్ కోర్టులో కూడా బెయిల్ దాఖలు చేశారు.

మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేవియట్​ పిటిషన్​ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా అర్ణబ్​ బెయిల్​ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోరాదని విన్నవించింది. కాగా బెయిల్​ కోసం సెషన్స్​ కోర్టులో అర్ణబ్​ వేసిన పిటిషన్​పైనా మంగళవారం విచారణ జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -