Monday, May 27, 2024
- Advertisement -

నయీం కేసు లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

తెలుగు దేశం పార్టీ లో తెలంగాణా లో మిగిలిన ఏకైక వ్యక్తి గా రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి ఈయన అడిగే లాజిక్ లు చూస్తే వింతగా ఉంటుంది. కొత్తగా ఎన్ కౌంటర్ అయిన గ్యాంగ్ స్టర్ నయీం కేసు లో మళ్ళీ తెరమీదకి వచ్చిన రేవంత్ వింత ప్రశ్నలు అడుగుతున్నారు. తెలుగు దేశం పార్టీ నేత , మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి కీ నయీం కీ సంబంధం ఉంది అని వార్తలు ఒస్తూ ఉండగా రేవంత్ ఉమా మాధవరెడ్డి ని సపోర్ట్ చేస్తున్నారు.

తెలంగాణలో ఎంతో గౌరవం కలిగిన కుటుంబాల మీద తెలంగాణ కోసమే పాటుపడిన వారిమీద బురదచల్లి లాభపడేలా జరిగే పరిణామాలను తాము చూస్తూ ఊరుకోబోమని ఉమా మాధవరెడ్డి కుటుంబంపై ఈగ వాలినా సహించేదిలేదని రేవంత్ హెచ్చరించారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని స్పష్టం చేశారు.

మొన్నామధ్య డిప్యూటీ సీఎం ని పీకేయ్యడం కోసం ఆయన మీద ఏవో అక్రమాలు అంటూ హడావిడి చేసారు కానీ ఆయన్ని పెకేసాక ఆయన మీద ఎలాంటి కేసులూ పెట్టలేదు అని. పార్టీలు మార్పించుకోవడం కోసం, రాజకీయ బ్లాక్ మెయిల్ కోసం ఇలాంటివి చేసే నైజం కెసిఆర్ ది అని రేవంత్ మండి పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -