కొన్ని రోజులుగా తెలంగాణాలో టీడీపీలో రేవంత్ వ్యవహారం గందరగోలం సృష్టించింది. కాంగ్రెస్ ఖండువా కప్పుకోనున్న వ్యవహారం కొలిక్కి వచ్చింది. చంద్రబాబుతో భేటి అయిన తర్వాత ఎమ్మెల్యే,పార్టీ పదువులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందె. ఇక కాంగ్రెష్ ఖండువా కప్పుకొనేందుకు రంగం సిద్ధం అయ్యింది.
పదవులకు రాజీనామ చేసిన తర్వాత నియేజక వర్గంలోని తన అనుచరులతో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తన అనుచరులందరితో సమావేశ మయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఉదయంనుంచి తనను కలసి మద్దతు తెలిపేందుకు వచ్చిన వారితో రేవంత్ బిజీగా గడుపుతున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు రాహుల్ గాంధీని కలుసుకునే రేవంత్, దాదాపు గంట సేపు ఆయనతోనే గడపనున్నారు. రేవంత్ భవిష్యత్, ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. అవసరం అయితె సోనియాగాంధీని కలసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారనె సమాచారం.
రాహుల్ తోనే కలసి ఆయన మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఆపై సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాహుల్ సమక్షంలో రేవంత్ మువ్వన్నెల కండువాను కప్పుకోనున్నారు. అనంతరం రాత్రికి రేవంత్రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు.