Saturday, May 18, 2024
- Advertisement -

రేవంత్ జైలు అనుభవాలుః అక్కడ ఏబీఎన్ మాత్రమే చూస్తారట!

- Advertisement -

ఓటుకు కోట్ల స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేత రేవంత్ రెడ్డి తన అనుభవాలను ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాలు పంచుకొన్నాడు. ఈ కార్యక్రమంలో రేవంత్ ఏబీఎన్ ను పొగిడేయడం విశేషం.

తన జైలు అనుభవాలను వివరిస్తూ  అక్కడ ఖైదీలు అంతా టీవీలో ఏబీఎన్ నే చూస్తారని రేవంత్ అంటున్నాడు. జైల్లో కేవలం దూరదర్శన్ ఏబీఎన్ చానళ్లు మాత్రమే వస్తాయని కూడా రేవంత్ రెడ్డి వివరించాడు.

 

మరి ఈ రకంగా చూస్తే రేవంత్ చెప్పినట్టుగా అక్కడ ఏబీఎన్ చూడటానికే అవకాశాలు ఎక్కువ అనుకోవాలి. ఎందుకంటే.. దూరదర్శన్ లో ఎలాగూ గొప్ప కార్యక్రమాలు రావు. దీంతో మసాలా న్యూస్ కోసం ఖైదీలు ఏబీఎన్ నే చూడవచ్చు! రెండు చానళ్లే వస్తున్నప్పుడు ఏబీఎన్ ను చూడటం పెద్ద విశేషం కాదు. ఇక తనకు జైల్లో ఖైదీల మధ్య గొప్ప ఆదరణ కనిపించిందని రేవంత్ రెడ్డి చెప్పాడు. 

 

తను ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకం కాబట్టి.. ఆ ఆదరణ కనిపించిందని రేవంత్ చెప్పాడు. తనను పోరాడాలని ఖైదీలు ప్రోత్సహించారని కూడా రేవంత్ రెడ్డి వివరించాడు. కేసీఆర్ పై తెలంగాణలో విపరీతమైన వ్యతిరేకత నెలకొందని.. అది జైల్లో కూడా కనిపించిందని రేవంత్ చెప్పుకొచ్చాడు! 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -