సినిమారంగంలో వివాదాలకు పెట్టింది పేరు రామ్గోపాల్వర్మ.నిత్యం ఏదోక వివాదంలేనిదే నిద్రరాదు. ఇక బయోపిక్ సినిమాలు తీస్తున్నాడంటె వివాదానికి పెప్పాల్సిందలేదు.
మీడియాను ఎలా వాడుకోవాలో వర్మకు తెలిసినంత ఎవరకి తెలియదు. ఇప్పుడు తాజగా నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నట్టుగా ప్రకటించి సంచలనాలకు తెరలేపారు వర్మగారు.
{loadmodule mod_custom,GA1}
ముఖ్యంగా ఎన్టీఆర్ పదవిని కోల్పోవటం, ఆయన మరణం లాంటి అంశాలపై చాలా వాదనలు ఉన్నాయి.ఈసినిమాలో ప్రస్తావించకూడదని కొందరు, ఆయన మరణానికి అసలు కారణాలను చూపించాలని మరికొందరు డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందరో మనోభావాలకు సంబంధించిన విషయం. ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెర మీద సంపూర్ణంగా ఆవిష్కరించకపోతే బాక్సాఫీస్ వద్ద మరో చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.
ఎన్టీఆర్ జీవిత కథలో అత్యంత వివాదాస్పదమైన అంశం లక్ష్మీ పార్వతితో వివాహం. అక్కడ నుంచే పార్టీలో ముసలం పుటింది. అదే ఎన్టీఆర్ పతనానికి దారి తీసిన అనూహ్యమైన నిర్ణయం. ఆ అంశమే ఎన్టీఆర్ మరణం అంచుకు తీసుకెళ్లిన దారుణ సంఘటన. ఈ విషయంలో ఎవరీ వాదన వారిదే. స్వయంగా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతికి అండగా నిలిచారు. అధికారాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు.
{loadmodule mod_custom,GA2}
అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ప్రశ్నగా మారింది.నన్ను వెన్నుపోటు పొడిచారని స్వయంగా రామారావుగారే చెప్పారు.మరి ఈసినమాలో వెన్నుపోటు పాత్ర ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}o4n-m3cigyc{/youtube}