Friday, May 10, 2024
- Advertisement -

మహమ్మారి అంటార్కిటికాలో కూడా రిబ్బన్ కటింగ్..!

- Advertisement -

కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని ఖండాలనూ చుట్టేసింది. తాజాగా.. అంటార్కిటికాలోని రెండు మిలిటరీ స్థావరాల్లో ఉన్న 58 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్టు చిలీ అధికారులు వెల్లడించారు. వీరిలో 36మంది జెనరల్​ బెర్నార్డో ఓ హిగ్గిన్స్​ రిక్యెల్మే సైనిక స్థావరంలో ఉన్నట్టు పేర్కొంది. మరో 21మంది.. చిలీ నుంచి అంటార్కిటికాకు వెళ్లిన నేవీ ఓడ సర్జియెంట్​ ఆల్డియాకు చెందిన వారని స్పష్టం చేసింది.

మరొక కేసు లాస్​ ఎస్ట్రెల్లాస్​ అనే గ్రామంలో వెలుగుచూసింది. లుటినెంట్​ రోడాల్ఫ్​ మార్ష్​ మార్టిన్​ వాయుదళ స్థావరంలో చిలీకి చెందిన పౌర సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు.

కరోనా కేసులపై తమకు అవగాహన ఉన్నట్టు అంటార్కిటికాలోని అమెరికా కార్యకలపాలను పర్యవేక్షిస్తున్న యూఎస్​ నేషనల్​ సైన్స్​ ఫౌండేషన్​ వెల్లడించింది. కరోనా సోకిన వారితో అమెరికా బృందం కలవలేదని స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -