సోషియల్ మీడియాలో పాపులర్ వ్యక్తి ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది మన ఏపీ ఐటీ మంత్రి లోకేష్ నాయుడు. ఎంతగా పాపులర్ అయ్యాడంటే తండ్రిని మించిపోయాడు. అది రాజకీయాలపరంగా అనుకుంటే పొరపాటే…అది కూడా ఆయ మాట్లాడే భాషద్వారా అంతపాపులారిటీ సంపాదించాడు.అందుకే ఏదైనా సభలకు చినబాబును పిలవాలంటే తెలుగు తమ్ముల్లు బెంబెలెత్తిపోతున్నారు. ఎప్పుడ ఎలా మాట్లాడుతాడో తెలియని పరిస్థితి.ఆయన మాట్లాడిన ప్రతీసారి లోకేష్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.చినబాబు స్పీచ్ పై ఇంటర్నెట్ లో బయట కూడా తెగ సెటైర్లు పడుతున్నాయి. ఇక వైసీపీ ఫైర్బ్రాండ్ రోజా గురించి చెప్పాల్సిన అవసరంలేదు. బాబుకే నద్దలేకుండా చేస్తోంది. అలాంటిది చినబాబు నోటినుంచి జాలు వారుతున్న ఆణిముత్యాలపై దిమ్మతిరిగే పంచ్లు విసిరారు రోజా…
లోకేష్కు తనకున్న అపారమైన తెలివితేటలను ప్రదర్శించడంలో జలీల్ ఖాన్ ను లోకేష్ బాబు మించిపోయారని రోజా వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిపోయారని అన్నారు. చంద్రబాబు తన 21 విదేశీ పర్యటనలు చేసి 21 ఉద్యోగాలను కూడా ఇవ్వలేకపోయారని.. ఇంతలో కొడుకు లోకేశ్ వచ్చి ఏకంగా రెండేళ్లలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తానని అంటున్నారని ఆయన్ను ఏమనాలో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. వర్థంతికి జయంతికి తేడా తెలియకుండా… ఏం మాట్లాడాలో తెలియకుండా వర్థంతికి శుభాకాంక్షలు చెప్పిన దౌర్భాగ్యుడైన మంత్రిని రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు రుద్దారంటూ నిప్పులు చెరిగారు. ఎంతో అనుభవమున్న పార్టీ నేతలను పక్కనబెట్టి పార్టీ మారిన వారికి రాజకీయ అనుభవం లేని వారికి బాబు పెద్దపీట వేశారన్నారు.
అంతటితో సరిపెట్టకుండా చినబాబు గురించి చెప్పాలంటే తను న్యాయ నిర్ణేతగా ఉన్న జబర్దస్త్ కామెడీషోకు కూడా సరిపోడన్నారు. పంచాయితీ రాజ్ శాఖ కావాలని మీరు ఎందుకు కోరుకున్నారని ప్రశ్నిస్తే తాగు నీటి సమస్యను సృష్టించడానికే మంత్రిని అయ్యానని ఆయన చెప్పడం చూస్తుంటే పెద్ద జోక్గా ఉందన్నారు.
Related