Thursday, May 2, 2024
- Advertisement -

సంపూ పెద్ద మనసు.. నిరుపేద కుటుంబానికి ఆసరా..!

- Advertisement -

తన చిత్రాలతో అందరినీ నవ్వించే సంపూర్ణేష్ బాబు సేవలో మాత్రం ముందుంటాడు. ఆయన జీవన శైలి కూడా చాలా సింపుల్​గా ఉంటుంది. అప్పుడప్పుడూ ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణిస్తుంటాడు. వ్యంగ్య నటనతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేశ్​ బాబు అనతి కాలంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలిసారి హీరోగా చేసిన హృదయకాలేయం, ఆ తర్వాతి చిత్రం కొబ్బరిమట్ట హిట్ కొట్టాయి. దీంతో ఆయన హీరోగా, నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.

సంపూర్ణేష్ బాబుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్​ ఉంది. అలాగా ఆయనకు సేవా గుణం కూడా ఎక్కువ. ఇటీవల ప్రముఖ సినిమా జర్నలిస్ట్​ టీఎన్​ఆర్​ చనిపోతే ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సంపూర్ణేష్​ బాబు మాత్రం రూ. 50 వేలు ఆయన కుటుంబానికి విరాళం ఇచ్చాడు. అయితే రీసెంట్​గా మరో సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు సంపూ.

ఇటీవల దుబ్బాకకు చెందిన నరసింహాచారి అనే వ్యక్తి అతడి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు కూతుర్లు అనాథలుగా మారారు. ఈ వార్త చూసిన సంపూ వారి కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని భావించాడు. తక్షణ సాయం కింద రూ. 25 వేలు అందించాడు. అంతేకాక ఆ పిల్లల చదువు కయ్యే ఖర్చును తానే భరిస్తానని ప్రకటించాడు.
నిర్మాత సాయి రాజేష్‌తో కలిసి ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు సంపూ. ఈ మేరకు ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్​ వైరల్​గా మారింది. సంపూ ఔదార్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.

Also Read: ఆల్ఫా, డేల్టా వేరియంట్​ ఏదైనా.. కోవాగ్జిన్‌ అ సూపర్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -