తన చిత్రాలతో అందరినీ నవ్వించే సంపూర్ణేష్ బాబు సేవలో మాత్రం ముందుంటాడు. ఆయన జీవన శైలి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అప్పుడప్పుడూ ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణిస్తుంటాడు. వ్యంగ్య నటనతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేశ్ బాబు అనతి కాలంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలిసారి హీరోగా చేసిన హృదయకాలేయం, ఆ తర్వాతి చిత్రం కొబ్బరిమట్ట హిట్ కొట్టాయి. దీంతో ఆయన హీరోగా, నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.
సంపూర్ణేష్ బాబుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగా ఆయనకు సేవా గుణం కూడా ఎక్కువ. ఇటీవల ప్రముఖ సినిమా జర్నలిస్ట్ టీఎన్ఆర్ చనిపోతే ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సంపూర్ణేష్ బాబు మాత్రం రూ. 50 వేలు ఆయన కుటుంబానికి విరాళం ఇచ్చాడు. అయితే రీసెంట్గా మరో సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు సంపూ.
ఇటీవల దుబ్బాకకు చెందిన నరసింహాచారి అనే వ్యక్తి అతడి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు కూతుర్లు అనాథలుగా మారారు. ఈ వార్త చూసిన సంపూ వారి కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని భావించాడు. తక్షణ సాయం కింద రూ. 25 వేలు అందించాడు. అంతేకాక ఆ పిల్లల చదువు కయ్యే ఖర్చును తానే భరిస్తానని ప్రకటించాడు.
నిర్మాత సాయి రాజేష్తో కలిసి ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు సంపూ. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. సంపూ ఔదార్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.
Also Read: ఆల్ఫా, డేల్టా వేరియంట్ ఏదైనా.. కోవాగ్జిన్ అ సూపర్..!