Monday, May 13, 2024
- Advertisement -

జ‌గ్గారెడ్డికి ష‌ర‌తుల‌తో కూడిన బేయిల్ మంజూరు చేసిన కోర్టు..

- Advertisement -

మ‌నుషుల అక్ర‌మ‌ర‌వాణా కేసులో అరెస్టై జైల్లో ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి బేయిల్ మంజూర‌య్యింది. మనుషుల అక్రమ రవాణా కేసులో సెప్టెంబర్ 11వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైల్లో జగ్గారెడ్డి ఉన్నాడు.

2004లో నకిలీ పత్రాలతో పాస్ పోర్టులు ఇప్పించి, మానవులను అక్రమ రవాణా చేశారనే ఆరోపణలతో జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ కు చెందిన ముగ్గురుని తన కుటుంబసభ్యులుగా పేర్కొంటూ వారిని అమెరికాకు పంపినట్టు కేసులో ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే జగ్గారెడ్డి బెయిల్‌కు ధరఖాస్తు చేసుకోగా…కోర్టు ఆయనకు సోమవారం నాడు బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ బెయిల్ రావడంతో సోమవారం నాడు జగ్గారెడ్డి జైలు నుండి ఈ సాయంత్రంవిడుదలయ్యే అవకాశం ఉంది.

జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది. రెండు రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం మార్కెట్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని జగ్గారెడ్డికి కోర్టు సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -