Friday, May 10, 2024
- Advertisement -

ప్ర‌జాసంక‌ల్ప‌ యాత్ర‌నా.. లేకా సెల్ఫీల యాత్ర‌నా….?

- Advertisement -

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర పొడువునా యువ‌కులు,విద్యార్థులు,మ‌హిళ‌లు అంద‌రు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పాద‌యాత్ర నాలోగోరోజుకు చేరింది. యువ‌తనుంచి పూర్తి మ‌ద్ద‌తు వ‌స్తోంది. అయితె పాద‌యాత్ర‌లో కొత్త ట్రెండ్ క‌న‌ప‌డుతోంది.

జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో ప్ర‌దానంగా రెండు కోణాలు క‌నిపిస్తున్నాయి. అందులో త‌మ అభిమాన‌నాయ‌కున్ని తమ క‌ష్టాల‌ను చెప్పుకొనేవాళ్లు రెండోది….ఆయ‌న‌తో సెల్ఫీదిగ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన నిర్వహిస్తున్న బహిరంగ సభలకు జనాలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అక్కడికి వచ్చిన వారంతా తమ కష్టాలను జగన్ కి చెప్పుకుంటున్నారు. తనదైన రీతిలో.. వారి కష్టాలను తీర్చేందుకు సహాయం చేస్తానని జగన్ హామీలు ఇస్తున్నారు.అంతేకాకుండా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, పనితీరును జగన్ ఎండగడుతున్నారు.

అయితె పాద‌యాత్ర‌లో సెల్ఫీల సంద‌డి బాగా క‌న‌ప‌డుతోంది. త‌న‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్న ప్ర‌తి ఒక్క‌రితోను జ‌గ‌న్ సెల్ఫీలు దిగుతున్నారు. ఆయ‌న‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ ప‌డుతున్నారు. ఇప్పటికే వేల మంది ఆయనతో సెల్ఫీ దిగారు. ఇంకొందరు జగన్ చేతికి వాళ్ల ఫోన్ ఇచ్చి మరీ .. ఆయనతో సెల్ఫీ దిగుతున్నారు.

వారిని మరింత ఉత్సాహపరిచేందుకు జగన్ కూడా.. అభిమానుల వద్ద నుంచి ఫోన్ తీసుకొని మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అభిమాన నేత వారితో సెల్ఫీలు దిగడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్రాలేకా సెల్ఫీ పాద‌యాత్రాని సోషియ‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -