- Advertisement -
నల్లధనం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. డిసెంబరు 30లోగా 500, 1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే వరస సెలవులతో పాత నోట్ల పార్పిడికి మరింత ఇబ్బంది వస్తుంది.
రద్దు చేసిన 500, 1000 నోట్లు 11 తేది నుంచి మార్చుకోవచ్చని కేంద్రం సూచించగా 12 (రెండో శనివారం), 13(ఆదివారం), 14(గురునానక్ జయంతి) న సెలవులు కావడంతో 11 న కుదరకపోతే .. 15 వరకు వేచి చేయాల్సిందే. దీంతో ఇప్పటికే నిత్యావసరాల కొనుగోలుకు తీవ్ర ఇబ్బంది పడుతున్న సామాన్య జనం మరింత కష్టాలు పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో ముందుగానే మేల్కొని జాగ్రత్త పడగలరని మనవి. ఈ విషయంను షేర్ చేసి అందరికి తెలపండి.
Related