- Advertisement -
తమిళనాడులోని సేలం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందగా 37 మంది గాయపడ్డారు. సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై మమంగం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి.
సేలం నుంచి ధర్మపురికి ప్రయాణికులతో రాంగ్ రూట్లో వెళ్తున్న ఓ బస్సును.. బెంగళూరు నుంచి సేలంకు వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఘటనాస్థలిలోనే ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో రెండు బస్సుల్లో గాయపడిన 37 మందిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.