Friday, May 17, 2024
- Advertisement -

అప్పు ఇచ్చిన వారితో శృంగారం చేయాల్సిందే..!

- Advertisement -

ముంబై న‌గ‌రంలో వింతతోపాటు ,దారుణం చోటు చేసుకుంది.అప్పు చేసిన ఓ ఘ‌నుడు ఆ అప్పును తీర్చ‌లేక త‌న భార్య‌ను తాక‌ట్టు పెట్టిన ముంబై న‌గ‌రంలో చోటు చేసుకుంది.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికి తాక‌ట్టు భార్య గ‌ర్భం దాల్చ‌డంతో అంద‌రు షాక్ గురైయ్యారు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…. ముంబయికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లు,ఇద్దరు అన్నాదమ్ముళ్లను పెళ్లాడారు. 2015లో వీరి వివాహం జరిగింది. ఇంటి అప్పుతీర్చేందుకు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను వారి భర్తలు,తమకు అప్పు ఇచ్చిన వారికి తాక‌ట్టు పెట్టారు. అప్పు ఇచ్చిన వ్యక్తికి కావాల్సినప్పుడల్లా .. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. అతని పడక సుఖం తీర్చీలా వారి భర్తలు ఒప్పందం కుదుర్చుకున్నారు.అలా అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను వేరే ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు.

ఇదేమిటని నిలదీయగా.. తమ భర్తలే రూ.1.5లక్షల కోసం తనిఖీ పెట్టినట్లు తెలుసుకొని నిర్ఘాంతపోయారు. ఇంటికి వెళ్లి.. భర్త, అత్తమామలను వారు నిలదీయగా.. పుట్టింటికి వెళ్లి ఇద్దరూ చెరో రూ.5లక్షలు తేవాలని లేకపోతే.. అప్పు ఇచ్చిన వారితో శృంగారం చేయాల్సిందేనని చెప్పారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు ఇటీవల గర్భం దాల్చారు. దీంతో.. ఆమెను అబార్షన్ చేయించుకోవాల్సిందిగా అత్తమామలు ఒత్తిడి చేశారు. దీంతో.. బాధితురాళ్లు ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -