- Advertisement -
విశాఖపట్నం జిల్లాలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో చనిపోయిన వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న మన్యం ప్రాంతం ఈ ఘటనతో ఉలిక్కి పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను తుపాకులతో రౌండప్ చేసి దూరంగా తీసుకెళ్లి మావోయిస్టుల కాల్చి చంపారని సివేరి సోము కారు డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు వెల్లడించారు. గ్రామసభకు వెళ్తున్న తమ కాన్వాయ్ని మావోయిస్టులు మార్గం మధ్యలో అడ్డగించినట్టు తెలిపారు. గన్మెన్ల ఆయుధాలను మావోయిస్టులు లాక్కొని తమని దూరంగా తీసుకెళ్లినట్టు చెప్పారు.
రన్నింగ్ లో ఉన్న కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కిడారి మరియు మాజీ ఎమ్మెల్యే సోమల పై ఒక్కసారిగా కొందరు మావోయిస్టులు దాడి చేసి బయటకు లాగి …చేతులను వెనక్కి కట్టేసి దూరంగా తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు పారిపోతే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తామని బెదిరించారని డ్రైవర్ చిట్టి బాబు తెలిపారు. కిడారి, సోమలపై కాల్పుల శబ్దం వినబడ్డాక తమను వదిలేసారని చిట్టిబాబు వెల్లడించారు.